![]() |
![]() |

'గుప్పెడంత మనసు' సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్ -665 లోకి అడుగు పెట్టింది. కాగా శుక్రవారం నాటి ఎపిసోడ్ లో వసుధార అమ్మనాన్నలు తనకి ఫోన్ చేసి తన బాగోగులు కనుక్కుంటారు. "నువ్వు ఏం బాధపడకు అమ్మా.. నరకాసురుడి నుండి మనకు విముక్తి అయింది. ఇక మనకు ఏం ఇబ్బందులు లేవు" అంటూ సంతోషంతో చక్రపాణి అంటాడు. వసుధార తన నాన్న లో వచ్చిన మార్పుకు సంతోషపడుతుంది.
మరో వైపు 'రిషిధార' లు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. వసుధార గురించి ఆలోచిస్తూ రిషి.. "అసలు వసుధర మనసులో ఏముంది. వేరొకరికి భార్య అయి ఉండి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తుంది?. తను నా జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్నగా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది" అని అనుకుంటాడు. మరోవైపు రిషి గురించి వసుధార ఆలోచిస్తూ.. "మిమ్మల్ని ఎప్పుడు వదులుకోను సర్.. మీరు నాకు జీవితంలో దొరికిన అరుదైన బహుమతి" అంటూ భావోద్వేగానికి లోనవుతుంది.
మరుసటి రోజు వసుధార కాలేజీకి వెళ్లి రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా రిషి రాకపోయే సరికి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చెయ్యడు. అలాగే జగతి, మహేంద్రలకు చేస్తుంది. ఎవరూ కూడా వసుధార ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో ధరణికి ఫోన్ చేస్తుంది. అప్పుడు రిషి సార్ ఇంటికి రాలేదు అనే విషయం తెలుసుకుంటుంది. ఇంటి దగ్గర, కాలేజీ దగ్గర లేడంటే గెస్ట్ హౌస్ లో ఉంటాడని భావించి అక్కడికి వెళ్తుంది.
గెస్ట్ హౌస్ లో రిషిని చూసిన వసుధార "మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు సర్" అని అడుగుతుంది. "అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్" అని రిషి అంటాడు. వసుధార బాధపడుతుంది. "రిషి సర్ ఇంటికి వెళ్ళండి" అని చెప్తుంది. అయినా వినకపోయేసరికి "మీ రిషి కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఉన్నాడు" అని మహేంద్రకి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. దాంతో ఇంట్లోవాళ్ళకి రిషి గెస్ట్ హౌస్ లో ఉన్న విషయం, రిషీతో పాటుగా వసుధార కూడా అక్కడే ఉన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |